నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 19:59

Delhi Liquor Scam Case : హై అలర్ట్..

•కవిత ఈడీ ఆఫీసు నుంచి బయటికొచ్చాక ఏం చేయబోతున్నారు..!?

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ (MLC Kavitha ED Enquiry) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన క్వశ్చన్ అవర్ సాయంత్రం 6.30 గంటలు దాటినా ఇంకా పూర్తి కాలేదు. ఏడున్నర గంటలుగా కవితను ఈడీ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు అధికారులు.

అయితే.. ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మీడియాను, బీఆర్ఎస్ కేడర్‌ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపుతున్నారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. కవిత బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

భారీ బందోబస్తు..

మరోవైపు.. ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటికి రాగానే ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి వాహనాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ భవన్ దగ్గర ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఏం జరగబోతోంది..?

అయితే.. విచారణ తర్వాత కవిత ఏం చేయబోతున్నారు..? మీడియాతో మాట్లాడుతారా..? ఢిల్లీలోని నివాసానికి వెళ్తారా లేకుంటే హైదరాబాద్‌కు పయనం అవుతారా..? అని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ ముగిస్తే.. ఇవాళే హైదరాబాద్‌కు కవిత బృందం బయల్దేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. విచారణకు రావాలని మరోసారి కవితకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే రేపు ఆదివారం కానుండటంతో సోమవారం విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు వచ్చి.. సోమవారం మళ్లీ వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా.. శుక్రవారం రాత్రి నుంచే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అక్కడే ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 19:56

మందుబాబులకు బాధాకరమైన వార్త.

మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల‌ నేపథ్యంలో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.

మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్రమంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మార్చి 11 సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 4 గంటల వరకు మూసేయాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలు అతిక్రమించిన వైన్స్‌లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరుగనుంది. మార్చి 16న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

కాగా మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి - హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం మార్చి 29తో, హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్‌ హసన్‌ జాఫ్రీ పదవీకాలం మే 1తో ముగియనున్నది. దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది...

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 19:48

Pawan Kalyan అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాల్సి వస్తుంది: పవన్‌

మంగళగిరి: బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు..

రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు.

''భారాస పార్టీ ఏపీకి వస్తే జనసేన ఆహ్వానించింది. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై భారాస స్పందించాలి. అన్యాయంపై భారాస వివరణ ఇవ్వాలి. బీసీ కులాల తొలగింపుపై వైకాపా, తెదేపా స్పందించాలి.

బీసీలకు జనసేన అండగా ఉంటుంది. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తా. మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారు. నేను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదు. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నా'' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు..

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 17:46

Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకి తగిన గుణపాఠం చెప్పాలి: చంద్రబాబు..

అమరావతి: ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపా(YSRCP)కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections)బుద్ధి చెప్పి... తెలుగుదేశం (TDP) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) కోరారు..

ఎన్నికల్లో ప్రలోభాలు, బోగస్ ఓట్లతో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ తమను ఎలా మోసం చేసిందో ఉద్యోగులు, టీచర్లు గుర్తించి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, భూంరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఎలా మోసం చేసిందో గ్రహించాలి..

''2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక అనేక సవాళ్లను అధిగమించాం. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను అధిగమించి పెట్టుబడులు తీసుకొచ్చాం. నాడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువత భవితకు బాటలు వేశాం. నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయి.. నిరుద్యోగం పెరిగిపోయింది. జాబ్ క్యాలెండర్, డీఎస్సీ గురించి ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అంతా గ్రహించాలి. నాడు విభజన కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్‌మెంట్‌ కాదు కదా.. కనీసం ఏనెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా లేదు. టీచర్లకు లిక్కర్ షాపుల వద్ద డ్యూటీలు వేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో టీచర్లు బుద్ధి చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు వైకాపా తెరతీసింది. దొంగ అడ్రస్‌లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్క తిరుపతి నగరంలోనే 7వేలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారు'' అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం.. పీడీఎఫ్‌తో ఒక అవగాహనకు వచ్చిందన్నారు. పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి.. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని ప్రజలను, తెలుగుదేశం మద్దతుదారులను కోరారు. ఇదే సందర్భంలో పీడీఎఫ్ అభ్యర్ధులకు ఓటు వేసిన ఓటర్లను వారి రెండో ప్రాధాన్య ఓటు తెదేపాకు వేయాలని సూచించారు. ఓటు చీలిపోవడం ద్వారా దుర్మార్గమైన వైకాపా ఎట్టి పరిస్థితుల్లోను గెలవడానికి వీలు లేదని ఆయన తేల్చి చెప్పారు. అందుకే రెండో ప్రాధాన్య ఓటు విషయంలో పరస్పర మార్పిడి జరగాల్సి ఉందన్నారు. పతనం అంచులో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో,చైతన్యంతో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులు, పట్టభద్రులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు..

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 12:16

CBI : కేసు ఏదైనా సీబీ'ఐ' చూస్తుంది.. విచారణ చేస్తుంది!

ఏయే కేసులు విచారిస్తుంది.. ప్రత్యేక నేరాలు :

నేరస్థులు చేసే తీవ్రమైన నేరాలను విచారణ చేయాలని ఆ కేసులను రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీం, హైకోర్టులు సీబీఐకి అప్పగిస్తాయి. ఉదాహరణకు టెర్రరిజం, బాంబు పేలుళ్లు, వ్యక్తుల అపహరణలు, మాఫియా, అండర్‌వరల్డ్ నేరాలు వంటివి..

ఆర్థిక నేరాలు : పెద్దపెద్ద ఆర్థిక కుంభకోణాలు, ఆర్థిక నేరాలు, దొంగనోట్ల తయారీ, బ్యాంకు మోసాలు, సైబర్‌ నేరాలు, ఎగుమతి, దిగుమతులు, విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అవకతవకలు, ఔషధాల రవాణా, పురాతన వస్తువుల సరఫరా, సాంస్కృతిక ఆస్తులు, నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణా కేసులు ఈ విభాగంలోకి వస్తాయి..

అవినీతి నిరోధక నేరాలు : ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులపై నమోదైన అవినీతి కేసులను సీబీఐ విచారిస్తుంది..

సుమోటో కేసులు : కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే నేరాలను సీబీఐ సుమోటోగా తీసుకొని విచారిస్తుంది.

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 11:04

Stomach surgery: కడుపులో వోడ్కా బాటిల్ .. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స

నేపాల్ లో ఓ యువకుడి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కడుపులో వోడ్కా బాటిల్ ఉందని గుర్తించిన డాక్టర్లు ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు..

కడుపులోంచి మద్యం బాటిల్ ను బయటకు తీయడంలో నేపాల్ వైద్యులు విజయం సాధించారు. రౌతహత్ జిల్లాలోని గుజ్రా మున్సిపాలిటీకి చెందిన 26ఏళ్ల యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విపరీతమైన కడుపునొప్పి, వాంతులతో నూర్సాద్ మన్సూరి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడినీ ఆస్పత్రికి తరలించారు..

మన్సూరి అనే యువకుడిని డాక్టర్లు ఎండోస్కొపి, స్కానింగ్ లు చేసి.. కడుపులో ఏదో గాజు పదార్థం ఉందని గుర్తించారు. క్షణక్షణానికి ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించారు. డాక్టర్ల టీమ్ అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.

కడుపులో ఉన్న వోడ్కా బాటిల్ ను బయటకు తీసేందుకు రెండున్నర గంటల సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు. మద్యం సీసా వల్ల పేషెంట్ పేగు పగిలిందని, దీంతో పరిస్థితి విషమంగా ఉందని శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు పేర్కొన్నారు. పేగు పగిలిపోవడంతో మలం కారుతోంది. ఆపరేట్ చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు.. ఈ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి.. కానీ శస్త్రచికిత్స విజయవంతమైంది.. ఇప్పుడు రోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 10:35

పవన్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ నాలుగు రోజుల ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.

ఈ మేరకు జనసేన అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 11 నుంచి 14 వరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో ముఖ్య సమావేశాలు, సమీక్షలు చేయనున్నారు.

ఈ నెల 11న మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో బిసి సంక్షేమంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం, 12న ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర నాయకులతో సమీక్ష, పార్టీలో చేరికలుంటాయని, అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు చేగొండి హరిరామయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ ఉంటుందని తెలిపారు.

13న ఉదయం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష, అదేరోజు సాయంత్రం 5 గంటలకు గవర్నరు ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌తో మర్యాదపూర్వక భేటీ ఉంటుందన్నారు. 14న సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు హాజరవుతారని, పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సభ వరకూ ర్యాలీగా వస్తారని తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 10:23

Gold Smugling: తెలుగు రాష్ట్రాల్లో బంగారం స్మగ్లింగ్.. రైల్వేస్టేషన్లలో పట్టివేత..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం (Gold Smugling) పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secundrabad Railway Station), శ్రీకాకుళం రైల్వే స్టేషన్ల (Srikakulam Railway Station)లో దాదాపు తొమ్మిది కేజీలకు పైగా స్మగ్లింగ్ బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు (DRI Officers) స్వాధీనం చేసుకున్నారు..

తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) ని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతా (Kolkata) నుంచి ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (Falaknuma Express) లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద 2.314 కిలోల స్మిగ్లింగ్ బంగారు కడ్డీలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.1.32 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి కోల్‌కతా నుంచి ఈ స్మగ్లింగ్ బంగారాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhrapradesh) శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లోనూ 7.396 కేజీల బంగారం పట్టుబడింది. చెన్నై మెయిల్ (హౌరా నుంచి చెన్నై) ద్వారా కోల్‌కతా నుంచి శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఒక వ్యక్తి వద్ద బంగారాన్ని అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని బ్యాగును క్షుణ్ణంగా వెతకగా.. ట్రాలీ బ్యాగ్ లోపలి జిప్ లైనింగ్ జేబులో ఈ బంగారం బయటపడింది. స్మగ్లింగ్ చేసిన ఈ బంగారం విలువ రూ. 4.21 కోట్లుగా గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి కోల్‌కతాలోని బార్‌లలో కరిగించి/రీకాస్ట్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. రెండు చోట్ల దాదాపు ఐదున్న కోట్లు విలువ చేసే బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 08:10

Liquor Scam: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. విచారణపై ఉత్కంఠ

డిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ అధికారుల ముందు హాజరవుతారు..

లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది..

నిజంనిప్పులాంటిది

Mar 11 2023, 08:07

H3N2 Virus | దేశంలో పెరుగుతున్న ఇన్‌ఫ్లూయెంజా కేసులు.. హెచ్‌3ఎన్‌2తో ఆరుగురు మృతి..

న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసుల వ్యాప్తి కలవరపెడుతున్నది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా సంభవించాయని తాజాగా వస్తున్న వార్తలు భయాందోళన రేపుతున్నది. ఇన్‌ఫ్లూయెంజాతో దేశంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి..

కర్ణాటకలోని హాసన్‌ జిల్లాలో ఒక హెచ్‌3ఎన్‌2 మరణాన్ని అధికారులు ధ్రువీకరించగా.. పంజాబ్‌, హర్యానాల్లో కూడా మరణాలు నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో హెచ్‌3ఎన్‌2 కారణంగా ఈనెల 1న మరణించిన వ్యక్తిని హీరె గౌడ(82)గా అధికారులు గుర్తించారు.

మరణాల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఇన్‌ఫ్లుయెంజా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని తెలిపింది. పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో తాజాగా 440 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,294కు చేరింది..